ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్సినిమా చేయబోతున్నాడు అనే దాని మీద నిన్న మొన్నటి వరకు సందిగ్ధం నెలకొంది.

వాస్తవానికి ముందుగా ఆయన త్రివిక్రమ్ తో ఆయన సినిమా చేస్తాడని అనుకున్నారు కానీ ఆ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో ఆయన కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.

అయితే కొరటాల శివ ఎన్నోసార్లు కథలో మార్పులు చేర్పులు సూచించినా అవి ఎన్టీఆర్ కు నచ్చకపోవడంతో ఇక ఆ సినిమా ఆగిపోవచ్చు అనే ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో అది నిజం కాదని సినిమాకు సంబంధించి డిఓపి రత్న వేలు, ప్రొడక్షన్ డిజైనర్ సబు సిరిల్ ఇద్దరితో కలిసి కొరటాల శివ సినిమాకు సంబంధించిన చర్చలు పెద్ద ఎత్తున జరుపుతున్నారని ప్రచారం కూడా జరిగింది.

అయితే ఎట్టకేలకు అదే నిజమైంది వీరిద్దరితో కలిసి కొరటాల శివ చర్చలు జరుపుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరూ నటిస్తారనే విషయం మీద సరైన క్లారిటీ లేదు కానీ ఈ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ ఆర్ట్స్, కొరటాల శివ స్నేహితులు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయట..

ఇక ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక ఎన్టీఆర్ సినిమాకి రత్నవేలు డిఓపిగా పనిచేయడం అలాగే బాహుబలి వంటి సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన సబు సిరిల్ పని చేస్తూ ఉండడం సినిమా మీద మరింత హైప్ పెంచుతోందట.. సబు సిరిల్ లాంటి ప్రొడక్షన్ డిజైనర్ ను సినిమా కోసం రంగంలోకి దించారంటే సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని అభిమానులైతే అంచనాలు పెట్టుకుంటున్నారు. మరి సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ను ఎప్పుడు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: