సమంత గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. దీంతో చాలా మంది సెలబ్రిటీలు ఈమె త్వరగా కోలుకోవాలని భావించారు. తమ సోషల్ మీడియా ఖాతాలో ఆమె గురించి కూడా పోస్ట్ లి పెట్టి ఆమె కోలుకోవాలని చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో సమంతా తాజాగా యశోద సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ఈ సినిమా నవంబర్ 11వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను ఇంతవరకు పాల్గొనలేదు సమంత.

దాంతో ఈమె ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలలో కనిపిస్తుందా లేదా అన్న అనుమానాలను చాలా మంది వ్యక్తపరిచారు. తాజాగా ఆమె బయటకు రావడం జరిగింది. దాంతో ఆమె ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనుంది అని చెబుతున్నారు. ఇప్పటిదాకా వరలక్ష్మి శరత్ కుమార్ తో సహా ఇతర నటీనటులందరూ కూడా ఈ సినిమా యొక్క ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు.

ఇప్పుడు సమంత కూడా వారికి యాడ్ అవడం సినిమా పట్ల మంచి క్రేజీ ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా ఆమె నిర్వహించిన ఫోటోషూట్ కూడా బయటకు వచ్చింది. ఆమె అభిమానులు ఆ ఫోటో షూట్ చూసి ఎంతగానో సంతోషిస్తున్నారు. అయితే ఆమె ఫేస్ లో మునుపటి గ్లో లేకపోవడం వారిని మరింత కలవరపరుస్తుంది. అనారోగ్యం కారణంగా ఆమె తన అందం లో చాలా మార్పులు తెచ్చుకోవాల్సి వచ్చింది అని తెలుస్తుంది ఏదేమైనా సమంత మునుపటి లా మారడానికి ఇంకెన్ని రోజులు సమయాన్ని తీసుకుంటుందో చూడాలి మరీ. ఇక ఆమె విజయ్ దేవరకొండ సరసన ఖుషి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించిన షూటింగ్ ఈమె లేని కారణంగానే ఆగిపోయింది. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగులో ఆమె పాల్గొననుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: