మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఈ మూవీ కి టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తూ ఉండగా , శృతి హాసన్మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటు వంటి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా , మాస్ మహారాజా రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మూవీ లో చిరంజీవి మరియు రవితేజల మధ్య యాక్షన్ సన్నివేశాలు మరియు ఒక పాట కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ పాత్ర ఈ మూవీ లో 40 నుండి 45 నిమిషాల పాటు ఉండబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాబి సింహ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... వాల్తేరు వీరయ్య మూవీ లో సెకండ్ హాఫ్ లో ఒక కీలకమైన పాత్ర ఉంటుంది అని , ఆ పాత్రలో టాలీవుడ్ యువ హీరో కార్తికేయ కనిపించబోతున్నట్లు ,  కార్తికేయ ఈ మూవీ లో ఎస్సై పాత్రలో కనిపించబోతున్నట్లు ,  కార్తికేయ ఈ మూవీ లో విలన్ చేతిలో హత్య చేయబడే పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   వాల్తేరు వీరయ్య మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. వాల్తేరు వీరయ్య మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: