టాలీవుడ్ లో అగ్ర కథానాయకగా ఉన్న
సమంత ప్రస్తుతం అనారోగ్య స్థితిలో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవలే ప్రేక్షకులందరికీ తెలియజేశారు సమంత. గత కొన్ని రోజులుగా వస్తున్న రకరకాల వార్తలకు ఆమె ఈ పోస్ట్ ద్వారా సమాధానం చెప్పినట్లు అయింది. ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈమె మళ్లీ
సినిమా సెట్స్ మీద అడుగు పెట్టేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని చెప్పింది. ఇక ఆమె
హీరోయిన్ గా చేస్తున్న యశోద అనే
సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యింది.
తొందరలోనే దీనికి సంబంధించిన విడుదల ఉన్న నేపథ్యంలో ఈ
సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలలో ఆమె పాల్గొనడానికి తన ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ఉందట. నిర్మాతకు భారీ నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో తన క్రేజ్ ను ఈ సినిమాకు తీసుకొచ్చే విధంగా ఆమె ప్రయత్నాలు చేస్తుంది.
నిర్మాత శివ లెంక
ప్రసాద్ కూడా ఆమె గురించి ఎలాంటి కాంట్రవర్సీ మాటలు చేయకపోవడం ఆమెను సపోర్ట్ చేసినట్లుగా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మంచితనాన్ని అర్థం చేసుకున్న
సమంత ఆయన కోసం ఈ
సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలలో సిద్ధమవ్వడానికి సిద్ధమయ్యింది.
ఇప్పటికే డబ్బింగ్ పనులను చేపట్టిన ఆమె ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూ కూడా చేసింది. ఇకపోతే త్వరలోనే ఆమె పూర్తి ఆరోగ్యంగా తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీని బట్టి ఆమె చేయవలసిన సినిమాల షూటింగ్లను కూడా చేయబోతుంది అని తెలుస్తుంది. బయట ఎక్కువగా తిరగకుండా ఇతర వ్యాధులు ఆమె జోలికి రాకుండా ఉండాలంటే ఆమె ఎక్కువ బయట ప్రదేశాలలో ఉండకూడదు కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న నేపథ్యంలో
సమంత ఎక్కువగా ఇంట్లో ఉండి ఇమ్యూనిటీని పెంచుకుంటుంది. తొందరలోనే ఆమె నటించబోయే
ఖుషి సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతోంది.