అద్భుతమైన నటుడు ప్రకాష్ రాజు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రకాష్ రాజు ఇప్పటికే అనేక భాషల మూవీ లలో , అనేక వైవిధ్యమైన పాత్రలలో నటించి ,  తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే ప్రకాష్ రాజ్ తాజాగా రంగ మార్తాండ అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో రమ్య కృష్ణ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మరాఠీ చిత్రం నట సామ్రాట్ కి రీమేక్ గా తెరకెక్కింది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రకాష్ రాజ్ "రంగ మార్తాండ" మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. ప్రకాష్ రాజ్ "రంగ మార్తాండ" మూవీ గురించి మాట్లాడుతూ ... నా కెరియర్ లో ఇదే బెస్ట్ మూవీ గా నిలుస్తుంది అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు. ఈ మూవీ లో కొత్త ప్రకాష్ రాజ్ ను చూస్తారు అని కూడా తెలియజేశాడు. ఈ మూవీ ని మొదట నేనే డైరెక్ట్ చేద్దాము అని అనుకున్నాను ,  కానీ కృష్ణ వంశీ కరెక్ట్ అని అనిపించింది అని ప్రకాష్ రాజ్ చెప్పకచ్చాడు.

ఇది ఇలా ఉంటే కృష్ణ వంశీ చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన చందమామ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కృష్ణ వంశీ సరైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకో లేక పోయాడు. మరి రంగ మార్తాండ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. రంగ మార్తాండ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: