యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పలు సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే.అందులో ప్రాజెక్ట్ కే ఒకటి. మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా 50% కి పైగా షూటింగ్ పూర్తి అయినట్లుగా సమాచారం అందుతుంది. బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, అమితాబచ్చన్ వంటి పలువురు ప్రముఖులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కేవలం ఇండియన్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసి ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందని దర్శకుడు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ఇది ఒక టైం ట్రావెల్ స్టోరీ అంటూ ఇప్పటికే క్లారిటీ చేశారు. ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదల కాబోతుంది అని అంతా భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు చిత్ర విడుదలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ దర్శకుడు కానీ నిర్మాత కాని ఇవ్వలేదు.
సినిమా షూటింగ్ కార్యక్రమాలు స్పీడ్ స్పీడ్ గా పూర్తి అవుతున్నాయి, కనుక విడుదల తేదీ పై ఒక క్లారిటీ ఇవ్వాలని ఉద్దేశంతో నిర్మాత అశ్విని దత్ అతి త్వరలోనే ఒక బిగ్ అప్డేట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఒక పోస్టర్ విడుదల చేసి దాంతో రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అతి త్వరలోనే ప్రాజెక్ట్‌ కే సినిమా యొక్క రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు. కానీ వాటి యొక్క విడుదల తేదీలు తెలియక అభిమానులు గందరగోళంతో ఉన్నారు.

ప్రాజెక్ట్‌ కే సినిమా యొక్క విడుదల తేదీ క్లారిటీ వస్తే వారికి కాస్త ఉపశమనం దక్కినట్లు అవుతుంది. ప్రభాస్ ఇటీవలే మారుతి దర్శకత్వంలో సినిమా మొదటి షెడ్యూల్‌ ను ముగించి సలార్‌ చిత్రీకరణ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రాజెక్ట్ కే షూట్‌ లో పాల్గొనబోతున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: