మరాఠీ మూవీ నటసామ్రాట్ ని చూసి ఇంప్రెస్ అయిన ప్రకాష్ రాజ్ ఆ చిత్రంలో ప్రస్తుతం నటిస్తూ ఉన్నారు. ఆ చిత్రమే రంగమార్తాండ. ఈ సినిమాని డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంలో తోపాటు చాలామంది స్టార్స్ నటిస్తూ ఉన్నారు. ఎన్నో రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఒక విషయం బయటకు రావడం జరిగింది. ముందు ప్రకాష్ రాజ్ ఈ సినిమాని చూసి డైరెక్ట్ చేద్దామనుకున్నారట. కానీ కొన్ని కారణాల చేత కృష్ణవంశీ డిస్కర్షన్ చేసి అతని డైరెక్షన్ లోని చేస్తానని తెలియజేసినట్లు సమాచారం.


అందుచేతనే కృష్ణవంశీ తనంతట తాను కాకుండా ప్రకాష్ రాజ్ సలహాతోనే ఈ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రంగమార్తాండ సినిమాలో తన పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని ఎన్నోసార్లు తెలియజేశారు ప్రకాష్ రాజ్. ఇన్నేళ్ల తనకేరియర్ లో ఇలాంటి పాత్ర ఎప్పుడు అసలు చేయలేదని తెలియజేశారు. బ్రహ్మానందం పాత్ర కూడా ఇందులో చాలా విభిన్నంగా ఉంటుంది అని ముఖ్యంగా సీరియస్ లుక్ లో ఉంటుందని విషయం వైరల్ గా మారుతోంది. ఎన్ని రోజుల నుంచో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది సరైన విడుదల డేట్ కోసం కృష్ణవంశీ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.


డైరెక్టర్ కృష్ణవంశీ గత కొన్ని సంవత్సరాలుగా సరైన సక్సెస్ అందుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు తిరిగి ఈ సినిమాతో ఫామ్ లోకి రావాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో కృష్ణవంశీ భార్య రమ్యకృష్ణ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం. కృష్ణవంశీ, రమ్యకృష్ణ లమధ్య పలు విభేదాలు ఉన్నాయని గతంలో కూడా ఎక్కువగా వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమా లో భాగంగా ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చిన కృష్ణవంశీ రమ్యకృష్ణ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: