తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ నటుడిగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయిన అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ తన కెరీర్ లో ఎక్కువగా కామెడీ ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. అలాగే నరేష్ కేవలం కామెడీ ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాల్లో మాత్రమే కాకుండా అద్భుతమైన వైవిధ్యమైన మూవీ లలో కూడా నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అల్లరి నరేష్ "ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆనంది ఈ మూవీ లో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ఏ ఆర్ మోహన్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని నవంబర్ 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిటీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ ను నవంబర్ 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ,  అలాగే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో నవంబర్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: