దక్షిణాది లో ఇప్పటికీ కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది అనుష్క. ఈమె సరే అంటే టాలీవుడ్ బడా నిర్మాతలు, దర్శకులు పెద్ద సినిమాల్లోకి తీసుకోవడానికి రెడీగా ఉన్నారట.. కానీ ఈమె మాత్రం పెద్ద సినిమాల ఆఫర్లకు అయితే ఓకే చెప్పడం లేదు. తనకు నచ్చిన కథల్లో నటించడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం ఆమె నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న మూవీలో నటిస్తుంది.'యూవీ క్రియేషన్స్' వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'యూవీ క్రియేషన్స్' వారితో అనుష్కకి మంచి సాన్నిహిత్యం ఉందట.

అందుకు కారణం ప్రభాస్. అతనితో ఉన్న స్నేహం వల్లనే యూవీ బ్యానర్లో 'మిర్చి' 'భాగమతి' వంటి చిత్రాలు చేసిందట అనుష్క. ఆ రెండు కూడా సూపర్ హిట్లు అయ్యాయి. ఇదిలా ఉండగా.. ప్రభాస్ తో అనుష్క నటించిన మొదటి చిత్రం 'బిల్లా'. ఈ మూవీ షూటింగ్లో భాగంగా అనుష్క చాలా ఇబ్బంది పడిందని తెలుస్తుంది.. తనకు నచ్చకపోయినా సరే ఓ సన్నివేశంలో చాలా ఇబ్బందిగా నటించిందట. విషయంలోకి వెళితే.. 'బిల్లా' సినిమాలో మాయ అనే పాత్రలో అనుష్క కనిపిస్తుంది.

తన అన్న, వదినలను చంపిన బిల్లా పై ఆమె పగ తీర్చుకోవడానికి ఆమె వస్తుంది. ఈ క్రమంలో అనుష్క బికినీ ధరించి ఓ సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. అలా నటించడం అనుష్కకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. 'అరుంధతి' లో ఎంతో హుందాగా ఉన్న పాత్రని పోషించి.. ఆ తర్వాత గ్లామర్ షో ని కొద్ది కొద్దిగా తగ్గించాలి అని అనుష్క భావించిందట. కానీ అప్పటికే కథ నచ్చి ప్రాజెక్టుకి కూడా సైన్ చేయడం,

పైగా ప్రభాస్ తో ఆ సినిమా ద్వారా ఏర్పడిన స్నేహం కారణంగా ఇబ్బంది పడినా ఆ సినిమాలో నటించిందట ఈ బ్యూటీ. ఈ విషయాన్ని ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందట ఇక అటు తర్వాత ప్రభాస్ తో 'మిర్చి' 'బాహుబలి'(సిరీస్) వంటి చిత్రాల్లో ఆమె నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అవన్నీ కూడా సూపర్ హిట్లు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: