మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో తేరకేక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని దర్శకుడు శంకర్ పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తూ ఉండగా ,  ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కియరా అద్వానీ ఈ మూవీలో హీరోయిన్ గ నటిస్తోంది. ఇది ఇలా ఉంటే శంకర్ తన పూర్వ మూవీ ల మాదిరి గానే రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న మూవీ ని కూడా అత్యంత గ్రాండ్ గా ,  అద్భుతమైన లొకేషన్ లలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.

అలాగే ఈ మూవీ లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను కూడా శంకర్ తెరకెక్కిస్తున్నారు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే శంకర్ సినిమాలో పాటలను అత్యద్భుతంగా చిత్రీకరిస్తాడు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ తో శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ లో కూడా పాటలు అందుకు ఏ మాత్రం తగ్గని విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కొత్త షెడ్యూల్ మరి కొన్ని రోజుల్లోనే న్యూజిలాండ్ లో ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ కొత్త షెడ్యూల్ లో మొదట రామ్ చరణ్ మరియు కియరా  అద్వానీ లపై ఒక రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

రొమాంటిక్ సాంగ్ కు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటతో పాటు న్యూజిలాండ్ లో మరికొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో అంజలి , సునీల్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఎస్ జే సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా , తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: