దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడు మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' సినిమా తీసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్.ఈ సినిమా పెద్ద హిట్ ని అందుకుంది. ఆ వెంటనే 'హిట్ 2' సినిమాని అనౌన్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అడివి శేష్ కూడా విభిన్నంగా సినిమాను ప్రమోట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు.ఇక వాల్ పోస్టర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని నేచురల్ స్టార్ నాని  సమర్పిస్తున్నారు. ఇంకా నిర్మాత ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల కాబోతుండటంతో నాని సినిమాకు అండగా నిలుస్తున్నారు. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ సాంగ్ 'ఉరికే ఉరికే' చాలా బాగా ఆకట్టుకుంటోంది.


ఈ పాటకు అడివి శేష్, మీనాక్షి చౌదరి రొమాంటిక్ గా స్టెప్పులేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వదిలి సినిమాను కొత్తగా ప్రమోట్ చేశారు. అయితే వారిద్దరూ కూడా స్టెప్పులేసింది నాని ఆఫీసులోనే నంట. ఇది చూసిన నాని చాలా ఆసక్తికరంగా స్పందించారు. 'నా ఆఫీస్ ను ఇలా కూడా వాడొచ్చా' అని అడివి శేష్, మీనాక్షి చౌదరిని సోషల్ మీడియా ద్వారా సరదాగా ప్రశ్నించారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.అయితే సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న నానికి ఈ సినిమా విజయం సాధించడం చాలా అవసరం. ఎందుకంటే నాని నటించిన గత సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చాలా ఘోరంగా ప్లాప్ అయ్యాయి. దీంతో నానికి చాలా నష్టం జరిగింది. ఇక నిర్మాతగా అయిన నాని హిట్ 2 సినిమాతో సేఫ్ అవ్వాలనుకుంటున్నాడు.అందుకే సినిమా ప్రమోషన్స్ పెంచారు. మరి ఈ సినిమా నానికి లాభాలు తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: