పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. బాహుబలి తో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకున్నాడు డార్లింగ్. ఇక ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్ళు దాటిన సంగతి తెలిసిందే..ప్రభాస్ హీరోగా పరిచయం మైన ఈశ్వర్. అయితే ఈశ్వర్ తర్వాత వరుస లు చేసినప్పటికీ ప్రభాస్ కు సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. అలాంటి టైం లోనే వచ్చింది వర్షం. దర్శకుడు శోభన్ తెరకెక్కిన ఈ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ప్రభాస్ స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. ప్రభాస్ ను యాక్షన్ హీరోగా మారిచిన వర్షం.


ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటించిన విషయం తెలిసిందే.. త్రిషకు కూడా ఈ చాలా ప్లస్ అయ్యింది. ఈ మూవీ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ అమ్మడు. తెలుగులో స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకొని దూసుకుపోయింది.తాజాగా ఈ ను రీరిలీజ్ చేశారు. ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్ళు అయిన సందర్భంగా వర్షం ను రిలీజ్ చేశారు. ఈ మూవీ మరోసారి థియేటర్స్ లో దుమ్మురేప్పింది. అయితే ఇప్పుడు త్రిష పై ప్రభాస్ ఫ్యాన్స్ గరం గరం గా ఉన్నారు. వర్షం రిలీజ్ సందర్భంగా థియేటర్స్ లో సందడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా త్రిష స్పందించింది..ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మీ కారణంగానే నేను ఇక్కడ ఉన్నాను అంటూ రాసుకొచ్చింది త్రిష. దాంతో ప్రభాస్ ఫాన్స్లో కొందరు అప్సెట్ అయ్యారని తెలుస్తోంది. నిజానికి వర్షం రిలీజ్ లో థియేటర్స్ లో సందడి చేసింది ప్రభాస్ ఫ్యాన్స్ . ప్రభాస్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే త్రిష ప్రభాస్ గురించి కానీ ప్రభాస్ ఫ్యాన్స్ గురించి కానీ చెప్పకపోవడం. కనీసం ప్రభాస్ ను ట్యాగ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారని తెలుస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: