తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మహేష్ తండ్రి కృష్ణ గురించి కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో పాటు ఎంతో టెక్నాలజీని కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణ. అయితే ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థకు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గచ్చిబౌలిలో ఒక హాస్పిటల్లో కృష్ణ చేరినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై వి కే. నరేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లుగా నరేష్ తెలియజేయడం జరిగింది. రానున్న 24 గంటలలో తనని డిశ్చార్జ్ చేయబోతున్నట్లుగా కూడా తెలియజేశారు నరేష్.


సూపర్ స్టార్ కృష్ణ హాస్పిటల్ లోకి చేర్చిన వెంటనే కుటుంబ సభ్యులు మొత్తం హాస్పిటల్ లోకి హుటాహుటిగా బయలుదేరి వచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు, నమ్రతాతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు కూడా అక్కడ హాజరైనట్లుగా సమాచారం. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి కృష్ణ వయోభారం వల్ల ఏదో ఒక అనారోగ్య సమస్య బారిన పడుతూనే ఉన్నారు. దీంతో తన ఆరోగ్యం పై పలు చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు కృష్ణ. నిన్నటి రోజున కృష్ణ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు గుర్తించడంతో వెంటనే హాస్పిటల్ లో చేర్పించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు కూడా తన తండ్రి దగ్గరే ఉంటూ ఆరోగ్య విషయాలను సైతం తెలుసుకుంటూ హాస్పిటల్ దగ్గర ఉన్నట్లుగా సమాచారం.


అయితే కృష్ణ నార్మల్గానే శ్వాస తీసుకుంటున్నట్లుగా ఇప్పుడు అంతా సెట్ అయింది అన్నట్లుగా తెలియజేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇక అభిమానులు ఎలాంటి భయాందోళనలు పడవలసిన అవసరం లేదంటూ తెలియజేస్తున్నారు. ఈరోజు సాయంత్రం లేదంటే రాత్రికి డిశ్చార్జ్ చేయబోతున్నట్లుగా కూడా తెలియజేశారు కుటుంబ సభ్యులు.దీంతో మహేష్ అభిమానులు కృష్ణ అభిమానులు కాస్త ఊపిరి ఊపిరిని పీల్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: