తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న నరేష్మూవీ తో అల్లరి నరేష్ గా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే నరేష్ ఎన్నో కామెడీ ప్రాధాన్యత గల మూవీ లలో నటించి ప్రేక్షకులను నవ్వించడం మాత్రమే కాకుండా ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో నటించి ప్రేక్షకులను తన నటన తో కూడా అలరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అల్లరి నరేష్ "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో అల్లరి నరేష్ సరసన అనంది హీరోయిన్ గా నటించగా ఏ ఆర్ మోహన్మూవీ కి దర్శకత్వం వహించాడు. నవంబర్ 25 వ తేదీన ఈ మూవీ ని థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆధ్యాంతం ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ఈ మూవీ ట్రైలర్ ఇప్పటి వరకు యూట్యూబ్ లో 1.5 మిలియన్ వ్యూస్ ను , 68 కే లైక్ లను సాధించి ,  ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇలా ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ద్వారా అల్లరి నరేష్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: