టాలీవుడ్ లో  చివరిగా కొండ పొలం సినిమాలో నటించింది రకుల్ ప్రీతిసింగ్.  ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఇక సినిమా షూటింగ్ ప్రమోషన్ కార్యక్రమాలు అంటూ ఉత్తరాది నగరాలను చుట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ.  తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా తన ప్రతిభ చూపించాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ రకుల్ ప్రీతిసింగ్ పైన సౌత్ పరిశ్రమ చాలా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయినా కూడా ఈ ముద్దుగుమ్మ ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో సౌత్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేవని చెప్పవచ్చు.

కేవలం ఇండియన్ -2 చిత్రం మాత్రమే ఉన్నది. ఇక్కడ బిజీగా ఉన్న సమయంలో శంకర్ దృష్టిలో పడడంతో ఆ చాన్స్ వరించింది . ఈ సినిమాపై రకుల్ భారీగానే ఆశలు పెట్టుకున్నది. మొదటిసారిగా ఒక స్టార్ డైరెక్టర్ తో అవకాశం లభించడంతో ఈమె ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కావాలని తన శాయ శక్తుల ప్రయత్నిస్తూ ఉంటుంది.  అందుకు తగ్గట్టుగా కసరత్తులు కూడా చేస్తూ ముందుకు వెళ్తుంది రకుల్. ఇందులో భాగంగా శంకర్ ఆదేశాల మేరకు ఈ అమ్మడు శరీరాన్ని మరింత సానపెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇండియన్-2 కోసం రకుల్ జిమ్ములో గంటల తరబడి వర్కౌట్ చేస్తూ ఉండడమే కాకుండా అందులో శిక్షణ కోసం హెవీ వర్క్ అవుట్ లు కూడా చేస్తూ ఉంది. ఇక ఉదయం,  సాయంత్రం వేళలు వీలైనంతవరకు టాప్ టాస్క్ పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వ్యాయానికి సంబంధించిన పలు వీడియోలు అభిమానులకు షేర్ చేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది రకుల్. మరి రకుల్ కష్టాన్ని తన వరకే కాకుండా నలుగురికి కూడా ఇలా షేర్ చేయడంతో మరింత స్ఫూర్తినిస్తుంది అంటూ ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి అనుకున్నంత సక్సెస్ ఇండియన్-2  ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: