భారీ అంచనాలతో ప్రారంభం అయిన బాలకృష్ణ ‘అన్ ష్టాపబుల్ 2’ కు ఆహా సంస్థ ఊహించని సమస్యలు వచ్చాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ షో సెకండ్ సీజన్ ను బాలయ్య చంద్రబాబు లోకేష్ లతో ప్రారంభించినప్పటికీ ఆతరువాత షోలలో టాప్ సెలెబ్రెటీ లతో బాలయ్య షో ఉంటుందని అందరు ఆశించారు.


ముఖ్యంగా ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు కలిసి వస్తే చాల బాగుంటుందని చాలామంది కోరుకున్నారు అయితే అది వాస్తవ రూపం దాల్చలేదు. ఆతరువాత బాలయ్య చిరంజీవిల షో కానీ లేదంటే పవన్ త్రివిక్రమ్ లతో బాలయ్య ఇంటర్వ్యూ చేస్తే చూడాలని చాలామంది కోరుకున్నారు. అయితే అది కూడ వెరవేరలేదు. కనీసం బాలకృష్ణ నాగార్జున ల కలయిక అయినా ఈ షోలో ఉంటుందని ఆశిస్తే అది కూడ జరగడం లేదు అంటున్నారు.



ఈమధ్య ఈ షోకు సంబంధించిన టీమ్ తమిళ టాప్ హీరోలు కమలహాసన్ రజనీకాంత్ లను సంప్రదించినప్పుడు వారి నుండి కూడ సరైన స్పందన రాలేదు అంటూ గాసిప్పులు వస్తున్నాయి. దీనితో ఈ టాప్ సెలెబ్రెటీలు అంతా బాలయ్య షోకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అన్న దాని పై స్పష్టమైన క్లారిటీ ఆహా టీమ్ కు కూడ అని టాక్.


దీనితో ప్రస్తుతం ఆహా టీమ్ సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ లను కలిపి ఆహా ‘అన్ ష్టాపబుల్ షోకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు బాలయ్యతో ‘వీర సింహారెడ్డి మూవీలో కలిసి నటించిన శృతి హాసన్ మాత్రం బాలయ్య షోకు వచ్చి సందడి చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అత్యంత భారీ అంచనాలతో ప్రారంభం అయిన ఈ షోకు క్రేజీ అతిధులు అందుబాటులో లేకపోవడం ఈ షోను హోస్ట్ చేస్తున్న ఆహా టీమ్ కు కలవర పాటుకు గురిచేస్తోంది అంటూ సోషల్ మీడియాలో గాసిప్పుల హడావిడి జరుగుతోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: