పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించి , టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇలా ఉంటే అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నా పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" మూవీ తో తిరిగి సినిమాల్లోకి రీ  ఎంట్రీ ఇచ్చాడు. వకీల్ సాబ్ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం భీమ్లా నాయక్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , క్రిష్ జాగర్లమూడి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీ యూనిట్ రామోజీ ఫిలిం సిటీ లో ఈ మూవీ ఇంటర్వెల్ సన్నివేశాలకు సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

ఈ యాక్షన్స్ సన్నివేశాల కోసం మూవీ యూనిట్ ఏకంగా 10 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లోని ఈ యాక్షన్స్ సన్నివేశాలు మూవీ కి హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: