అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప... పాన్ ఇండియా సినిమాగా విడుదల అయ్యి భారీ సక్సెస్ తో పాటు మంచి టాక్ ను కూడా అందుకుంది.. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు ఆడియెన్స్‌కు బాగా నచ్చేసింది. ఇక ఈ సినిమా అందుకున్న భారీ సక్సెస్ కారణంగా, ఇప్పుడు అందరి చూపులు పుష్ప పార్ట్ 2 పైనే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా ను అఫీషియల్‌గా స్టార్ట్ కూడా చేశారు.

అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇదిగో, అదిగో అంటున్న చిత్ర యూనిట్ ఎప్పుడు మొదలుపెడతారా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అసలు పుష్ప 2 సినిమా షూటింగ్ ఎందుకు ఆలస్యం అవుతుందని వారు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ సినిమా ఆలస్యానికి కారణం దర్శకుడు సుకుమార్ అని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తొలి భాగం అందుకున్న భారీ విజయం తరువాత రెండో పార్ట్‌ పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయి లో ఉంటాయో తనకు తెలుసని, అందుకే వారికి ఎలాంటి నిరుత్సాహం కలగకుండా, ఈ సినిమాను అన్ని విధాలుగా పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దేందుకు సమయం తీసుకుంటున్నాడట సుకుమార్..

ఇక ప్రీ-ప్రొడక్షన్ పనుల్లోనూ ఎలాంటి అవకతవకలు జరగకుండా, సినిమా షూటింగ్ ఆలస్యమైనా, ఔట్‌పుట్ మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా రావాల్సిందే అంటున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. అందుకే ఈ సినిమా షూటింగ్‌ను డిసెంబర్‌లో మొదలుపెట్టేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమా షూటింగ్ ముగించుకుని 2024 మార్చి లేదా ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని సుకుమార్ పక్కా ప్లానింగ్‌ తో వెళ్తున్నాడట. మరి నిజంగానే సుకుమార్ పుష్ప 2 సినిమా విషయంలో ఆలస్యానికి అసలు కారణం ఏంటి.. సినిమా ను ఎప్పుడూ విడుదల చేస్తారు అన్నది తెలియాల్సి వుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: