అదుర్స్ అనే కార్యక్రమం ద్వారా యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టిన శ్రీముఖి ఇక ఇప్పుడు తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఛానల్ తో సంబంధం లేకుండా అన్ని ఛానల్స్ లో కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తూ ప్రస్తుతం దూసుకుపోతుంది ఈ అమ్మడు. యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.


 అదే సమయంలో ఏక సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన అంద చెందాలతో ఎంతోమంది మతి పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇలా ఒకవైపు యాంకరింగ్ తో అదరగొడుతూనే మరోవైపు డాన్స్ ఐకాన్ అనే షోలో టీం లీడర్ గా కూడా వ్యవహరిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి ఓంకార్ హోస్టింగ్ చేస్తూ ఉన్నాడు. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, వర్సటైల్  యాక్టర్ రమ్యకృష్ణ జడ్జిలుగా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పాలి. డాన్స్ ఐకాన్ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ కూడా సందడి చేశాడు.


టీమ్ లీడర్ మోనాల్ స్థానంలో ఇక షోకి ఎంట్రీ ఇచ్చిన సోహెల్ తనదైన జడ్జిమెంట్ తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ప్రోమోలో భాగంగా శ్రీముఖి సోహెల్ మధ్య గొడవ జరగడం గమనార్హం. అదే సమయంలో ఇక జడ్జి సీట్లో కూర్చున్న రమ్యకృష్ణ కూడా సీరియస్ అయింది అని చెప్పాలి. శ్రీముఖి టీం నుంచి ఆసిఫ్ అండ్ రాజు కలిసి నాటు నాటు పాటుకు డాన్స్ చేశారు. పర్ఫామెన్స్ కి సోహెల్ రెడ్ కార్డ్ చూపించాడు. ఎంతో హర్ట్ అయినా శ్రీముఖి ఇది మోనాల్ కూర్చున్న సీట్ ప్రభావం అంటూ గొడవ పెట్టుకుంది. డాన్స్ ఐకాన్ లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని అంటూ సోహెల్ సమాధానం చెప్పాడు. ఇక అంతలోనే కలిగించుకున్న రమ్యకృష్ణ మేము ఇక్కడ ఎందుకు ఉన్నాం.. జడ్జిమెంట్ చెప్పడానికే కదా అంటూ సీరియస్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: