భారతదేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ హీరోగా తేరకెక్కిన జెంటిల్ మేన్ మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టిన శంకర్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి , దేశ వ్యాప్తంగా దర్శకుడి గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే శంకర్ తన సినిమాలలో పాటలను మరియు ఫైట్ లను అత్యద్భుతంగా చిత్రీకరిస్తాడు అన్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇప్పటివరకు శంకర్ దర్శకత్వం వహించిన దాదాపు ప్రతి మూవీ లోను పాటలు మరియు యాక్షన్ సన్నివేశాలు అద్భుతమైన రీతిలో ఉంటాయి. దానితో శంకర్ మూవీ అంటే పాటలు మరియు యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా చూసే జనాలు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శంకర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియరా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కుతున్న  మూవీ కి దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని దర్శకుడు శంకర్ పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో , ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో , ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే శంకర్మూవీ లోని పాటలను కూడా అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ లోని ఒక్క పాట కోసమే 15 కోట్లు రూపాయలు ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం. ఈ పాట షూటింగ్ 12 రోజుల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది  ఈ వార్త కనుక నిజం అయితే సౌత్ ఇండియా లోనే అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిన సాంగ్ ఇదే కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: