టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు
కొరటాల శివ. భారీ విజయాలను తన ఖాతా లో వేసుకుని తక్కువ సమయంలోనే అగ్ర దర్శకుడుగా ఎదిగిన ఆయన ఆచార్య సినిమాతో తొలి పరాజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం ఆయనకు భారీ స్థాయిలోనే పరాజయా న్ని చెడ్డ పేరును తీసుకువచ్చింది అని చెప్పాలి. ఆర్థిక కారణాలు కూడా ఈ
సినిమా ఈ విధంగా అవ్వడానికి కారణం కాగా ఫైనల్ గా దీని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు
ఎన్టీఆర్ తో కలిసి
సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.
తొందర్లోనే ఈ
సినిమా యొక్క షూటింగ్ను మొదలుపెట్టబోతు ఉండగా చాలా రోజులుగా ఈ
సినిమా మొదలు కాకపోవడం పట్ల
ఎన్టీఆర్ అభిమానులు
సినిమా ప్రేక్షకులు ఎంతో అసహనాన్ని వ్యక్తపరిచారు. ఫైనల్ గా ఈ
సినిమా ఇప్పుడు మొదలు కాబోతూ ఉండటం అందరిలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే ఈ
సినిమా జరుగుతున్న సమయంలోనే మరొక సినిమాను కూడా మొదలు పెట్టాలని
కొరటాల శివ భావిస్తూ ఉన్నాడు వాస్తవానికి హీరోలు ఒకేసారి రెండు సినిమాలను చేస్తూ ఉంటారు.
ఈ విధంగా సినిమాను చేసిన దాఖలాలు ఎప్పుడు కనబడలేదు కానీ
కొరటాల మాత్రం ఇంకొక
సినిమా కూడా చేయాలని భావిస్తున్నాడట. దానికి వేరే ఒక టీమును పెట్టి స్క్రిప్ట్ పనులను చేయిస్తున్నాడట అయితే ఇందులో ఎవరు హీరోగా నటిస్తారు అన్న విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో
సినిమా చేస్తున్న సమయంలో ఇలాంటి ఆలోచనలు చేయడం ఏమాత్రం సరికాదని
ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు సలహాలు ఇస్తున్నారు. ఆచార్య ప్రభావం నుంచి కోలుకోవాలి అంటే తప్పకుండా ఒక భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే
ఎన్టీఆర్ సినిమాపై పూర్తిస్థాయి దృష్టి పెట్టి విజయాన్ని అందుకోవాలని వారు చెబుతున్నారు.