టాలీవుడ్ లో అగ్ర కథానాయకగా కొనసాగుతుంది పూజ హెగ్డే. తెలుగు
సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు
తమిళ హిందీ చిత్ర పరిశ్రమలలో సైతం ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు ఉంది. అక్కడ సినిమాలు చేసిన అనుభవం ఉంది. అదే సమయంలో తెలుగులో కూడా ఆమె అగ్ర హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. అయితే ఆమె
సినిమా ల ఎంపిక విధానం ఇప్పుడు అయోమయంగా ఉందని చెప్పవచ్చు. ఆ కారణంగానే ఆమెను తమ సినిమాలలో తీసుకునేందుకు నిర్మాతలు అలోచిస్తున్నారు.
గతంలో సినిమాలలో మొదటి ఆప్షన్ గా కనిపించిన ఈమె ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ గా కూడా కనబడటం లేదట. దానికి కారణం ఏమిటి అంటే ఆమె నటించే
సినిమా లు మొదలు కాకముందే ఆగిపోవడం.
విజయ్ దేవరకొండ హీరోగా నటించవలసిన జనగణమన
సినిమా మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దు కోబోతుంది అని చెబుతున్న ఈ
సినిమా ఏ కారణం వల్ల ఆగి పోయినా కూడా
పూజా హెగ్డే కి మాత్రం ఒక మంచి
సినిమా మిస్ అయింది అన్న వార్తలు వస్తున్నాయి.
ఇక
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయవలసిన
సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది అని చెబుతున్నారు. దాదాపుగా ఇదే నిజం అని అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమాలో కూడా
హీరోయిన్ గా
పూజా హెగ్డే నే నటించవలసి ఉంది. కానీ పవన్
కళ్యాణ్ ఈ సినిమాను మధ్యలోనే ఆపడం జరిగింది. అలా
పూజ హెగ్డే కు ఈ
సినిమా లేకపోవడం భారీ మైనస్ అవుతుంది అని చెప్పాలి. ఇకపోతే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో కూడా ఈమె
హీరోయిన్ గా నటించగా ఈ చిత్రం యొక్క చిత్రీకరణ కూడా అయోమయ పరిస్థితిలో ఉంది. ఈ
సినిమా కూడా ఆగిపోతే మాత్రం
పూజ హెగ్డే కు
టాలీవుడ్ లో కష్టమయమైన రోజులు మొదలయ్యాయి అని చెప్పాలి.