ఇటీవల కాలంలో చాలా మంది దర్శకులు ఒక హీరో ఒప్పుకోకపోతే మరొక హీరో దగ్గరికి వెళ్లి తమ కథను చెప్పి వారితో సినిమాలను చేస్తున్నారు. ఆ విధంగా చాలామంది దర్శకులు చేశారు. ఇక మఫ్టీ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు నర్తన్ తదుపరి సినిమాగా యశ్ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కేజీఎఫ్ తర్వాత సినిమాను ఈ దర్శకుడు తో చేయబోతున్నాడు అనే వార్తలు రాగా ఆ చిత్రం ఇంకా మొదలు కాకపోవడం అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందో లేదో అని అనుమానాలను కలిగిస్తుంది.

ఇంకొక వైపు ఈ దర్శకుడు ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కథ వినిపించగా అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఆయన విజయ్ దేవరకొండకు కథ చెప్పబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. లైగర్ తర్వాత ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొంటున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తున్నాడు అన్న విషయమై అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది.

చాలామంది దర్శకులు ఆయనకు కథలు చెప్పగా ఇప్పుడు తాజాగా ఈ నర్తన్ కూడా ఆయనకు ఓ కథ చెప్పారని తెలుస్తుంది. మరి దీనిపట్ల విజయ్ దేవరకొండ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియాల్సి ఉంది. ఇకపోతే దాదాపుగా ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోయే సినిమా ఓకే అవ్వబోతుంది అని చెబుతున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా సినిమాను ఓకే చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలను ఒకేసారి చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. మరి చాలామంది హీరో లు ఒకేసారి రెండు కి పైగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ ఈ సినిమాలు చేయడం అందరిని సంతోష పరుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: