ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆయన చేసిన ప్రమోషన్స్ ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో నచ్చాయి. అంతేకాదు దీనికి సంబంధించిన ఆడియన్స్ తో ట్రాక్షన్ కూడా విజయ్ దేవరకొండకు బాగా పెరిగిపోవడంతో ఆయన తదుపరి సినిమా కోసం అందరూ వేచి చూస్తున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే బాలీవుడ్ ప్రేక్షకులు అయితే ఈ హీరో తదుపరి సినిమా ఎప్పుడు వస్తుందో అన్నట్లుగా ఎదురుచూస్తున్నారని సోషల్ మీడియాలో వారు పెడుతున్న కామెంట్లను బట్టి తెలుస్తుంది.

దానికి తగ్గట్లుగానే ఒక బాలీవుడ్ సినిమా చేసే విధంగా రంగం సిద్ధం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఖుషి సినిమా యొక్క షూటింగ్లో ఈ హీరో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం సమంతకు అనారోగ్యం ఉన్న కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిపివేయబడింది. ఆమె మళ్ళీ పూర్తి ఆరోగ్యంతో సినిమా చేయడానికి రాబోతూ ఉండగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెల్లడి కానుంది. 

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాలకు సంబంధించి అప్డేట్ కూడా రాబోతుంది అని తెలుస్తుంది. ఆయన ఒక టాలీవుడ్ సినిమాను అలాగే ఒక బాలీవుడ్ సినిమాను కలిపి ఒకేసారి చేయబోతున్నారని తెలుస్తుంది. బాలీవుడ్లో అగ్ర దర్శకులతో సినిమాలు చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొందరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలుగులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్ లో కూడా బ్రహ్మాస్త్ర సినిమాలో దేవ్ పాత్రలో ఆయన నటించబోతున్నారు అని తెలుస్తుంది. పెళ్లి చూపులు సినిమా తో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఇంతటి పెద్ద హీరో గా ఎదిగిన విజయ్ దేవరకొండ గత రెండు సినిమాలుగా ప్రేక్షకులను అలరించలేక పోతున్నాడు. మరి అయన ఇప్పటికైనా సినిమాలతో హిట్ కొడతాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: