ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి తీసిన అద్భుత ప్రేమకావ్యం "సీతారామం". ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన రోజు నుండి అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు మించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. 2022 లో రిలీజ్ అయిన సినిమాల్లో కల్లా బెస్ట్ మూవీగా ట్రేడ్ పండితుల నుండి కితాబు అందుకుంది. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ లెఫ్టనెంట్ రామ్ గా మరియు మరాఠీ భామ మృణాల్ థాకూర్ సీతగా నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి మంచి వసూళ్లను సాధించింది. లక్షల మంది హృదయాలను కదిలించిన గొప్ప ప్రేమకథాచిత్రంగా అందరి మన్ననలు అందుకుంది.

సినిమా తర్వాత మృణాల్ థాకూర్ పేరు ఎవ్వరూ పట్టించుకునే అవకాశం ఉండదు అనే చెప్పాలి, చాలా మంది ఈమెను జీవితాంతం సీతగానే గుర్తించుకుంటారు అని ఖచ్చితంగా చెప్పగలం. ఈ సినిమాతో ఈమె పేరు దక్షిణ భారతదేశంలో మారుమ్రోగిపోయింది. మృణాల్ థాకూర్ కు కొన్ని అవకాశాలు కూడా వచ్చాయని, అయితే ఈమె ఆచితూచి అడుగులు వేస్తోందని టాక్. కాగా వినిపిస్తున్న సమాచారం మేరకు టాలీవుడ్ లో గొప్ప నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న వైజయంతి మూవీస్ లో ఈమెకు ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అది కూడా లేడీ ఓరియెంటెడ్ కథలో నటించాలని పిలుపు వచ్చిందట.

ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నాయట. గత కొంతకాలంగా అశ్వనీదత్ తర్వాత తన కుమార్తెలు ఇద్దరూ సంస్థను మంచి కంటెంట్ తో విజయపధంలో నడిపిస్తున్నారు. ఈ కథాచర్చలో అశ్వనీదత్ కుమార్తెలు పాలుపంచుకున్నారని వినికిడి. వీరు స్టెప్ ఇన్ అయ్యారంటే మంచి కథనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు అన్నది గతం చెబుతోంది. కానీ ఈ సినిమాకు డైరెక్టర్ మరియు ఇతర తారాగణం గురించి ఇంకా ఫైనల్ కాలేదట. సినిమాకు కీలకం అయిన కథ ఫైనల్ అయితే మిగిలిన విషయాలు ప్రకటిస్తారని టాలీవుడ్ నుండి సమాచారం అందుతోంది. మరి ఈ గోల్డెన్ ఆఫర్ మన సీతకు కలిసొచ్చి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదగాలని కోరుకుందాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: