మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన నటుడి గా మంచి గుర్తింపు ను తెచ్చుకున్న వారిలో ఒకరు అయినటు వంటి పృధ్విరాజ్ సుకుమరన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించిన పృథ్వీరాజ్ ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. పృధ్వీరాజ్ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించక పోయినప్పటికీ పృథ్విరాజ్ సుకుమారక్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం పృథ్వీరాజ్ "జనగణమన" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ ద్వారా పృథ్వీరాజ్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా తెరకెక్కుతున్న సలార్ అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ కి  ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా పృథ్వీరాజ్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ విజన్ కు , ఆయన మూవీ ని తెరకెక్కిస్తున్న తీరుకు , నేను ఫిదా అయ్యాను. ఈ మూవీ లో యాక్షన్ బ్లాక్ ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ మూవీ చిన్న సినిమా కాదు , నేను అనుకున్న దానికంటే చాలా భారీ స్థాయిలో ఉంది అని తాజాగా పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు. ఇలా ఉంటే సలార్ మూవీ ని ప్రశాంత్ నీల్ పన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నాడు. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: