రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి పృధ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో ప్రభాస్ హీరో గా నటించడం "కే జి ఎఫ్" లాంటి భారీ బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్మూవీ కి దర్శకత్వం వహించడంతో , ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో మూవీ యూనిట్ భారీ యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లోని యాక్షన్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నాయి అని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇలా పృథ్వీరాజ్ ఈ మూవీ లోని యాక్షన్స్ అన్ని వేషాల గురించి ప్రత్యేకంగా తెలియజేయడంతో ఈ మూవీ లోని యాక్షన్ సన్నివేశాలపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెంచుకున్నారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఈ మూవీ లోని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కే జి ఎఫ్ మూవీ లోని యాక్షన్ సన్నివేశాలకు మించి ఈ మూవీ లో యాక్షన్ సన్నీ వేషాలు ఉండే విధంగా ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించడం తో ప్రభాస్ అభిమానులు ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: