తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి అల్లరి నరేష్ తాజాగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించగా , ఆనంది ఈ మూవీ లో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని నవంబర్ 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ యూనిటీ ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను తెలియజేసింది. అలాగే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇద్దరు హీరోలు కూడా ముఖ్య అతిథులుగా విచ్చనున్నట్లు కూడా తాజాగా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. 

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పార్క్ హయత్ , హైదరాబాద్ లో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు , ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో యువ హీరోలు అయినటు వంటి శ్రీ విష్ణు మరియు విశ్వక్ సేన్ లు చీఫ్ గెస్ట్ లుగా విజయ్ నున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ  ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  ఇది ఇలా ఉంటే నాంది మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న అల్లరి నరేష్ "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: