తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ ప్రస్తుతం వరిసు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీvని నిర్మిస్తున్నాడు. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. తమిళం లో రూపొందుతున్న ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.

కాకపోతే ఇప్పటివరకు ఈ సినిమాను ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మూవీ యూనిట్ ప్రకటించలేదు. ఇది ఇలా ఉంటే తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ ప్రస్తుతం తునివు అని భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా కొన్ని రోజుల క్రితమే వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఈ మూవీ ని కూడా ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు మూవీ ల విడుదల తేదీ లను డిసెంబర్ మధ్య వరకు మూవీ యూనిట్ లు ప్రకటించే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

అలాగే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు మూవీ లు కూడా దాదాపు ఒకే రోజు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు మూవీ లు కూడా ఒకే రోజు విడుదల అయినట్లు అయితే ఏ మూవీ కి ఎక్కువ కలెక్షన్ లు వస్తాయో అనేది చాలా ఆసక్తికరంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: