సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత  దర్షక దీరుడు ఎస్.ఎస్ రాజమౌలి డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్‏తో రూపొందనున్న ఈ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రిపుల్ ఆర్ తర్వాత జక్కన తెరకెక్కించే మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్ కోసం ప్రపంచమే ఎదురుచూస్తుంది. అలాగే ఈ గ్లోబల్ అడ్వెంచర్ రెంజ్‏లో ఉండనుందని రాజమౌళి చెప్పడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.


ఈ క్రమంలోనే తాజాగా మరోసారి మహేష్ ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే అప్డేట్స్ ఇచ్చాడు జక్కన్న. ఈ గురించి ఆసక్తిక విషయాలను బయటపెట్టారు.జక్కన్న మాట్లాడుతూ.. నేను దర్శకత్వం వహించిన చిత్రాల్లో చాలా వాటికి మా నాన్నే రచయిత.. ఇక ఇప్పుడు మహేష్ కు కూడా ఆయనే రచయిత. కొన్ని నెలల క్రితమే కథ రాయం స్టార్ట్ చేశారు. ఆయన నేను డెవలప్‏మెంట్ పనుల్లో బిజీగా ఉన్నాం. ఇదొక అడ్వెంచర్ కథ. చాలా కాలంగా ఈ జోనర్‏లో చేయాలని ఉంది. ఇండియానా జోన్స్ నాకు ఇష్టమైన  అంటూ చెప్పుకొచ్చారు.


హాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవం లో రాజమౌళి పాల్గొన్నారు. లాస్ ఏంజెల్స్‏ లో జరిగిన ఈ వేడుకలలో కార్తికేయ తో కలిసి సందడి చేశారు జక్కన్న. ఆస్కార్ అవార్డులకు ముందు సినీ పరిశ్రమకు విశేష సేవలు అందిస్తోన్న ప్రముఖులకు అకాడమీ ఈ అవార్డు ను అందజేయడం ఆనవాయితీ. మరోవైపు ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వం లో నటిస్తున్నారు.. ఆసినిమాకు వాయిదాల మీద వాయిదా పడుతుంది. మహేష్ బాబు కుటుంబం లో ఎవరొకరు మరనిస్తున్నారు. మొన్న మహేష్ బాబు తల్లి, నిన్న తండ్రి చనిపోవడంతో సినిమా షూటింగ్ ఆగిపొయింది..


మరింత సమాచారం తెలుసుకోండి: