తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ దర్శకులలో ఒకరు అయినటు వంటి అజయ్ భూపతి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు కార్తికేయ హీరోగా పాయల్  రాజ్ పుత్ హీరోయిన్ గా తెరకెక్కిన ఆర్ ఎక్స్ 100 మూవీ తో దర్శకుడు గా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. మంచి అంచనాల నడుమ చిన్న సినిమాగా విడుదల అయిన ఆర్ ఎక్స్ 100 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకొని పెద్ద విజయాన్ని అందుకుంది.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఆర్ ఎక్స్ 100 మూవీ తో మంచి  క్రేజ్ ను సంపాదించుకున్న ఈ దర్శకుడు ఆ తరువాత శర్వానంద్ , సిద్ధార్థ్ హీరో లుగా అదితీ రావ్ హైదరి , అను ఇమాన్యుయల్ హీరోయిన్ లుగా మహా సముద్రం అనే మూవీ ని రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన మహా సముద్రం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. దానితో మహా సముద్రం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా మహా సముద్రం మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర పరయాయన్ని ఎదుర్కొన్న అజయ్ భూపతి ప్రస్తుతం తన తదుపరి మూవీ కి సంబంధించి నా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని లేడీ ఓరియంటెడ్ మూవీ గా రూపొందించ డానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఓ  లేడీ ఓరియంటెడ్ కథను సిద్ధం చేసుకున్నట్లు , ఆ మూవీ లో ఒక స్టార్ హీరోయిన్ తో నటింప చేయడానికి అజయ్ భూపతి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: