షార్ట్ ఫిల్మ్ తో తన సత్తా చాటి న్యాచురల్ స్టార్ నానిని నిర్మాతగా ఒప్పించి అ! అనే సినిమా తీశాడు డైరక్టర్ ప్రశాంత్ వర్మ. మొదటి సినిమాతోనే అతని టాలెంట్ అర్ధం అయ్యింది. ఆ సినిమా హిట్ అవడంతో అతనికి ఆఫర్లు వచ్చాయి. మధ్యలో కల్కి అనే మూవీ చేసినా అది యావరేజ్ గా నిలిచిని. ఇక జాంబి రెడ్డి అంటూ మరో ప్రయోగం చేసిన ప్రశాంత్ వర్మ ఆ మూవీతో మరోసారి తన టాలెంట్ చూపించాడు. ఈ మూవీతో డైరక్టర్ గా ప్రశాంత్ వర్మ ప్రతిభ అందరికి తెలిసింది. అందుకే ఇప్పుడు అతని నుంచి సినిమా వస్తుంది అంటే ఎక్సైట్ అవుతున్నారు.

ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఇండియన్ సూపర్ హీరొ మూవీ హనుమాన్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా మూవీ టీజర్ కూడా రిలీజైంది. తేజా సజ్జాని పెట్టుకుని పాన్ ఇండియా లెవల్లో హనుమాన్ మూవీ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా టీజర్ చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. సినిమా టీజర్ లోని గ్రాఫిక్స్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు ప్రశాంత్ వర్మ. ముఖ్యంగా 16 కోట్లతో ఇంత మంచి వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చేయించడం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. హనుమాన్ గ్రాఫిక్స్ ని ఆదిపురుష్ గ్రాఫిక్స్ తో పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ వర్మ మొదటి నుంచి తన టాలెంట్ చూపిస్తూనే ఉన్నాడు.

ఇండియన్ సూపర్ హీరో మూవీగా వస్తున్న హనుమాన్ కచ్చితంగా మరోసారి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలిసేలా చేస్తుందని అంటున్నారు. తేజా సజ్జాకి ఈ మూవీ ప్రత్యేకంగా నిలుస్తుందని. సినిమాతో అతని రేంజ్ కూడా మారుతుందని చెప్పొచ్చు. సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. హనుమాన్ టీజర్ తోనే శాంపిల్ చూపించిన ప్రశాంత్ వర్మ అసలు బొమ్మ వెండితెర మీద చూపిస్తా అంటున్నాడు. యంగ్ డైరక్టర్స్ లో ప్రశాంత్ వర్మ కొత్త ప్రయోగాలతో సంచలనాలు సృష్టిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: