2023 సంక్రాంతికి బాక్సాఫీస్ ఫైట్ ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ సీనియర్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహం బాలకృష్ణ కలిసి పోటీకి దిగుతున్నారు. వాళ్తేరు వీరయ్యగా చిరు.. వీర సింహా రెడ్డిగా బాలయ్య ఇద్దరు ఢీ కొడుతున్నారు. వీరి సినిమాల పోటీ మెగా నందమూరి ఫ్యాన్స్ కి ఎక్సయిటింగ్ కలిగిస్తుంది. 2023 సంక్రాంతికి ఈ రెండు సినిమాల రిలీజ్ అనుకున్నా ఏది ముందు ఏది వెనక అన్నది క్లారిటీ రాలేదు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం జనవరి 11న వాల్తేరు వీరయ్య.. మరుసటి రోజు అనగా జనవరి 12న వీర సింహా రెడ్డి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారట. చిరు, బాలయ్య బాక్సాఫీస్ ఫైట్ ఇదేమి మొదటిసారి కాదు.

ఒకసారి చిరు హిట్ కొడితే.. మరోసారి బాలయ్య హిట్ కొట్టారు. సంక్రాంతికి మొనగాడు అయ్యేందుకు ఇద్దరు హీరొలు రెడీ అవుతున్నారు. అయితే వీరితో పాటుగా విజయ్ వారసుడు మూవీ కూడా తెలుగులో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడే నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం తమిళ మేకర్స్ ని నొప్పించింది. అయితే వారసుడు నిర్మాత తెలుగు వాడే.. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజే ఈ మూవీ నిర్మిస్తున్నారు. స్ట్రైట్ తెలుగు సినిమాలానే అది తెరకెక్కుతుంది. అలాంటిది అది అరవ సినిమా అనుకుని ఎలా రిలీజ్ అడ్డుకుంటారని ఒక వాదన.

సంక్రాంతికి తెలుగు సినిమాలే రిలీజ్ అవ్వాలని అంటున్నా వారసుడు కూడా బైలింగ్వల్ మూవీగా వస్తుంది. అందుకే ఆ సినిమా రిలీజ్ కు అడ్డంకులు తొలగిపోతాయని చెప్పొచ్చు. మొత్తానికి సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారుతుంది. మరి సంక్రాంతికి ఎవరు విజయ ఢంకా మొగిస్తారు అన్నది చూడాలి. మెగా ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య కోసం.. బాలయ్య ఫ్యాన్స్ వీర సిం హా రెడ్డి కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏది సూపర్ హిట్ కొడుతుందో అని అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: