ప్రతిష్టాత్మక డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలైన రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలసి స్క్రీన్ షేర్ చేసుకున్న తాజా పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్. అజయ్ దేవగన్, ఆలియా భట్, శ్రియాసరన్, ఒలీవియా మోరిస్ తదితరుల భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా రూ.550 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. కానీ సినిమా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అయితే తెలుగు తో పాటు ఇతర భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను తాజాగా తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న జపాన్ దేశంలో కూడా విడుదల చేశారు.

ప్రత్యేకంగా అక్కడ చిత్ర యూనిట్ అంతా ప్రమోషన్స్ చేపట్టి మరీ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. దీంతో మొదటి రెండు రోజుల్లో మార్కెట్ రాకపోయినా ప్రస్తుతం అందుతున్న సమాచారం 2M మార్కుని దాటేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.  జపాన్లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంటోందని చిత్ర బృందం ప్రకటించింది. మొత్తానికి తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా అంతకంటే ఎక్కువ కలెక్షన్ రాబట్టడమే కాకుండా విదేశాలలో సైతం తెలుగు సినిమా సత్తా చాటుతోందని చెప్పవచ్చు. దీంతో రాజమౌళి ఖాతాలో బాహుబలి సినిమాల తర్వాత వచ్చిన మరో సంచలన విజయమని చెప్పడంలో సందేహం లేదు.

రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. దీని తర్వాత రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.  ఇప్పటికే ఈ సినిమా అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా రాబోతుందని రాజమౌళి హింట్ ఇచ్చారు.  దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR