డైరెక్టర్ లోకేష్ కనగరాజు గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఎక్కువగా డ్రగ్స్ , మాఫియా తదితర అంశాల పైన సినిమాలను తెరకెక్కిస్తూ ప్రజలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అవియాల్ అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా 2016లో తన కెరీర్ ను మొదలుపెట్టిన లోకేష్ 2017లో మా నగరం సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత 2021లో మాస్టర్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక అంతకుముందే 2019లో హీరో కార్తీతో ఖైదీ సినిమా చేసి.. అదే సినిమా సీక్వెల్ గా కమలహాసన్, సూర్య వంటి హీరోలతో విక్రమ్ సినిమా చేసి మరింత విజయాన్ని సొంతం చేసుకున్నారు.

అంతేకాదు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఖైదీ సినిమా రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు నాల్గవసారి భారీ బడ్జెట్తో హీరో విజయ్ దళపతి తో సినిమాను తెరకెక్కించబోతున్నారు లోకేష్.. దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.  ఇందులో సాయి పల్లవి,  సంజయ్ దత్,  పృథ్విరాజ్ సుకుమారన్,  మన్సూర్ అలీఖాన్,  గౌతమ్ మీనం తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.  ఇదిలా వుండగా ఈ సినిమా క్లైమాక్స్ ఏంటో..  ఇంకా మొదలు పెట్టక ముందే రివీల్ చేసేసారు లోకేష్. అయితే ఈ సినిమా మొదలుకాకముందే సినిమాపై అంచనాలు పెంచడానికి లోకేష్ ఇలా అసలు విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది.


లోకేష్ నుండి వస్తున్న ఈ సినిమా  మళ్లీ డ్రగ్స్, మాఫియా అంశాల చుట్టూనే తిరుగుతుంది. ఇందులో హీరో  విజయ్ ఎల్‌సియులో చేరతారని, చివర్లో కమల్ హాసన్,  సూర్య, కార్తీ, విజయ్‌ల మధ్య గొడవ జరుగుతుందని లోకేష్ ధృవీకరించారు. ఇంత పెద్ద స్టార్ హీరోలు తెరపై పోటీ పడడం ఎంత రసవత్తరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: