సినీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో సలార్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు విడుదలవుతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.కాగా మలయాళ స్టార్ హీరోలలో ఒకరైన పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియా మేనన్ సలార్ మూవీ గురించి...

 మాట్లాడుతూ అంచనాలను అమాంతం పెంచేశారు.ఇకపోతే సలార్ మూవీ రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తుందని సుప్రియ అన్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.ఇక  గొప్ప సృజనాత్మకత కలిగి ఉన్న వ్యక్తుల పనితీరును దగ్గరినుంచి చూసే ఛాన్స్ రావడం సంతోషాన్ని కలిగిస్తోందని సుప్రియ చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నీల్ అతని బృందం ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతోందని సుప్రియ అన్నారు.అయితే  సలార్ మూవీ సెట్స్ ను సందర్శించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.

కాగా సలార్ సినిమా 5 భాషల్లో తెరకెక్కుతుండగా ఈ సినిమా కేజీఎఫ్2 సినిమాను మించిన హిట్ గా నిలవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని చాలామంది భావిస్తున్నారు.  అయితే ప్రభాస్ ఈ సినిమాతో పాటు పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.అంతేకాదు ప్రభాస్ ఒక్కో ప్రాజెక్ట్ కు 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం.ఇక  ప్రభాస్ తో పని చేయడానికి బాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపుతున్నారు. అయితే తర్వాత ప్రాజెక్ట్ లు భారీ సక్సెస్ సాధించి ప్రభాస్ స్థాయిని మరింత పెంచాలని అభిమానులు భావిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: