రవిబాబు దర్శకత్వం లో తెరకెక్కిన అల్లరి మూవీ తో హీరోగా కెరియర్ ను మొదలు పెట్టిన అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ లో ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఉన్న సినిమా లలో నటించిన అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో కామెడీ సినిమాల కంటే కూడా వైవిధ్యమైన సినిమాలలో నటించడానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే అల్లరి నరేష్ "నాంది" అనే ఓ వైవిధ్యమైన మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ లో అల్లరి నరేష్ నటన కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే నాంది మూవీ కూడా మంచి విజయం సాధించడం తో అల్లరి నరేష్ క్రేజ్ ఈ సినిమాతో మరింత పెరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా అల్లరి నరేష్ "ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం" అనే మరో వైవిధ్యమైన మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గ నటించగా , ఏ ఆర్ మోహన్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని నవంబర్ 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు పాటలను విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. నాంది మూవీ తర్వాత అల్లరి నరేష్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికుల మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: