ఎన్టీఆర్ తల్లి, హరికృష్ణ సతీమణి షాలిని బయట ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు. హరికృష్ణ ఆమెను లీగల్‌గా పెళ్లి చేసుకోలేదని, సహజీవనం మాత్రమే సాగించారని అంటుంటారు.అయితే నిజానికి శాలిని ఒక మ్యూజిక్ టీచర్ కాగా, ఆమె ఎన్టీఆర్ కుటుంబంలోని పిల్లలకు సంగీత పాఠాలు చెప్పేందుకు వచ్చేవారు.ఇక  ఎన్టీఆర్‌కు చేదోడు వాడోదుగా ఉంటూ హరికృష్ణ ఎక్కువగా ఇంట్లో ఉండడం వల్ల శాలినితో పరిచయం ఏర్పడి, అది తర్వాత ప్రేమగా మారింది.ఇకపోతే  ఒక్కోసారి శాలినిని స్వయంగా హరికృష్ణనే తన కారులో ఇంటి దగ్గర దింపేవారట.

అప్పటికే హరికృష్ణకు లక్ష్మితో పెళ్లి జరిగి, జానకిరామ్ పుట్టాడు. ఇక కళ్యాణ్ రామ్ కడుపులో ఉన్న సమయంలోనే .. హరికృష్ణ షాలినీతో వేరే కాపురం పెట్టేశాడు.కాగా  ఈ విషయం ఇంట్లో తెలియడం, ఆమెను మ్యూజిక్‌గా టీచర్‌గా తొలిగించడం వెంటవెంటనే జరిగాయి. ఇక అనంతరం హరికృష్ణను కుటుంబసభ్యులందరూ మందలించినప్పటికీ ఆయన శాలినితో బంధాన్ని తెంచుకోలేకపోయారు. షాలిని.. హరికృష్ణని భర్తగా భావించి జీవితం గడిపారు .అయితే  హరికృష్ణ తన రెండో భార్యగా శాలినిని అందరికీ పరిచయం చేయకపోయినా.. ప్రేమను మాత్రం ఆమెకే ఎక్కువగా పంచారట.

నందమూరి మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్‌ స్టార్‌ హీరోగా ఉండగా, బాలయ్యతో ఆయనకు ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తుంది.అంతేకాదు  పైకి మాత్రం తాము బాబాయ్, అబ్బాయి అన్నట్టు చెప్తుంటారు. లోలోపల మాత్రం ఇద్దరికీ కాస్త గ్యాప్ ఉందనేది అందరికి తెలిసిన విషయం.  గతంలో జూనియర్ ఎన్టీఆర్‌ను బాలయ్య అవమానించాడనే వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.ఇదిలావుంటే  గతంలో సీనియర్‌ జర్నలిస్టు ఒకరు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఉమ్మడి ఫ్యామిలీ ఫంక్షన్‌కు జూనియర్ ఎన్టీఆర్‌ తన తల్లితో కలిసి హాజరయినప్పుడు, వారిని చూసిన బాలయ్య అందరి ముందే బయటకు పొమ్మన్నాడంట. ఇక దాంతో చేసేదేం లేక జూనియర్‌ ఎన్టీఆర్‌ తన తల్లిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: