రాబోతున్న సంక్రాంతికి చిరంజీవి బాలకృష్ణ సినిమాలతో పాటు కోలీవుడ్ హీరోల విజయ్ అజిత్ ల సినిమాలు కూడ రాబోతున్నాయి. ఈ వార్ లో తన సత్తా చాటాలని అఖిల్ కూడ ప్రయత్నిస్తున్నాడు. దీనితో రాబోతున్న సంక్రాంతి వార్ విజేత ఎవరు అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో బాగా పెరిగి పోతోంది.


సంక్రాంతి రిజల్ట్ ఇంకా తేలకుండానే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సమ్మర్ సినిమాల డేట్స్ కూడ ఫిక్స్ అవ్వడంతో ఇండస్ట్రీ వర్గాలు ఎంత ముందు చూపుతో వ్యవహరిస్తున్నాయో అర్థం అవుతుంది. రాబోయే సమ్మర్ రేస్ మార్చి రెండవ వారం నుండి ‘డీజే టిల్లు 2’ తో మొదలు కాబోతోంది. అదే నెల చివరిలో నాని ‘దసరా’ రాబోతోంది.


ఏప్రియల్ 7న రవితేజా ‘రావణాసుర’ విడుదల అవుతుంటే కేవలం ఒకవారం గ్యాప్ తీసుకుని చిరంజీవి తన ‘భోళాశంకర్’ తో వస్తున్నాడు. అయితే చిరంజీవి సినిమా విడుదల అయ్యే రోజే రజినీకాంత్ తన ‘జైలర్’ మూవీని విడుదల చేస్తూ ఏకంగా చిరంజీవికి షాక్ ఇవ్వబోతున్నాడు. ఈసినిమా విడుదలైన మరో వారం రోజులకి నాగచైతన్య విక్రమ్ ప్రభుల మూవీ విడుదలకు రెడీ కాబోతోంది. ఈసినిమాలు అన్నీ ఒక ఎత్తైతే పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు హాట్ టాపిక్ గా మారనున్నది. అందుతున్న సంకేతాల ప్రకారం ఈమూవీని వచ్చే సంవత్సరం మేలో విడుదల చేయాలని భావిస్తున్నారు.


సమంత అనారోగ్యం నుండి కోలుకుని త్వరలో షూటింగ్ కు రాగలిగితే విజయ్ దేవరకొండతో ఆమె నటిస్తున్న ‘ఖుషీ’ కూడ సమ్మర్ లోనే రిలీజ్ అంటున్నారు. మహేష్ తన తండ్రి మరణం షాక్ నుండి త్వరగా కోలుకుని వచ్చేనెల నుండి షూటింగ్ కు రాబోతున్నాడు అన్నవార్తలు వస్తున్న పరిస్థితులలో మహేష్ త్రివిక్రమ్మూవీ కూడ వచ్చే సమ్మర్ లోనే ఉండబోతోంది. దీనితో ఇన్ని భారీ సినిమాల మధ్య ఏసినిమా సమ్మర్ రేస్ విజేత అవుతుంది అన్న అంచనాలు ఎవరికీ అందడం లేదు..




మరింత సమాచారం తెలుసుకోండి: