మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ ఇప్పటికే అనేక మూవీ లలో నటించి దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును దక్కించుకున్నాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాతలలో ఒకరు అయినటు వంటి దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా , ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి , సునీల్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించ నుండగా , ఎస్ జే సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది.

మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తి కూడా అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ న్యూస్ లాండ్ లో జరుగుతుంది. న్యూజిలాండ్ లో ఈ మూవీ యూనిట్ రామ్ చరణ్ , కియారా అద్వాని పై భారీ బడ్జెట్ తో ఒక సాంగ్ ను మరియు కొన్ని సన్నివేశాలను తెరకెక్కించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయక పోవడంతో రామ్ చరణ్ కెరియర్ లో ఈ సినిమా 15 వ మూవీ  గా రూపొందుతున్న నేపథ్యంలో ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ చిత్రీకరణ పూర్తి కాక ముందే ఈ మూవీ నార్త్ అమెరికా థ్రియేటికల్ హక్కులు అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది. ఈ సినిమా నార్త్ అమెరికా థ్రియేటికల్ హక్కులను శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: