పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా , ఎంఎం కీరవాణిమూవీ కి సంగీతం అందిస్తున్నాడు. నిధి అగర్వాల్మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఈ మూవీ కి సంబంధించిన యాక్షన్స్ సన్నివేషాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ చిత్రీకరిస్తున్న యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం.

మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" మూవీ తర్వాత రాజకీయాలపై దృష్టి పెట్టె సమయంలో మరో మూవీ ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాక పోతే పవన్ కళ్యాణ్మూవీమూవీ లో నటించబోతున్నాడు అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.

అలాగే తమిళం లో సూపర్ హిట్ సాధించిన వినోదయ సీతం మూవీ ని తెలుగు లో రీమిక్ చేయడానికి కూడా కమిట్ అయి ఉన్నాడు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వం లో కూడా ఒక మూవీ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఈ ముగ్గురు దర్శకులలో కళ్యాణ్ ఏ దర్శకుడు తో మూవీ చేయడానికి ఆసక్తి ని చూపిస్తాడో అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: