అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున అతి తక్కువ సమయంలోనే మాస్ హీరోగా.. నవ మన్మధుడిగా.. కింగ్ నాగార్జున గా ఇలా రకరకాల బిరుదులు పొంది.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఇంకొక వైపు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా దిగి మరింత లాభార్జన పొందుతున్నాడు.. అంతేకాదు ఇటీవల బిగ్ బాస్ , మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి షోలకి కూడా హోస్టుగా వ్యవహరించి.. మరింత పాపులారిటీని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన పలు రకాల చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.


ఇదిలా వుండగా.. ప్రస్తుతం సీనియర్ హీరోల వారసులందరూ కూడా పాన్ ఇండియా సినిమాల పైన దృష్టి పెడుతూ.. పాన్ ఇండియా హీరోలుగా మారుతుంటే.. అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ మాత్రం అడపాదడపా సినిమాలతోనే సరిపెట్టుకుంటున్నారు.. ఈ క్రమంలోనే ఒక తండ్రిగా తన కొడుకులను పాన్ ఇండియా హీరోలుగా తీర్చిదిద్దడం మానేసి..  ఒక యంగ్ హీరో పై నమ్మకంతో .. అతడిని పాన్ ఇండియా హీరోగా మార్చడానికి నాగార్జున పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ హీరో ఎవరో కాదు తాజాగా హిట్ 2 సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్న యంగ్ హీరో అడవి శేష్.


సెలెక్టివ్ కథల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే అడవి శేష్ నటనపై ప్రేక్షకులకు మంచి అభిప్రాయం ఉంది . ఈ నేపథ్యంలోనే అడవి శేష్ ను పాన్ ఇండియా హీరోగా చేయడానికి నాగార్జున పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ క్రమంలోనే అడవి శేష్ పై ఉన్న నమ్మకం కారణంగా.. అటు నాగచైతన్య ఇటు అఖిల్ ను పాన్ ఇండియా హీరోలు చేయకుండా వారికి అన్యాయం చేస్తున్నాడు నాగార్జున అంటూ రకరకాలుగా నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అయితే అడవి శేష్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని బట్టి అతడిని పాన్ ఇండియా రేంజ్ లో లాంచ్ చేసి డబ్బు పొందాలని ఆలోచిస్తున్నారా? అన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తన కొడుకులను కాదని అడవి శేష్ ను  పాన్ ఇండియా రేంజ్ లో లాంచ్ చేయబోతుండడంపై విమర్శలు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: