నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ సీనియర్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ వీర సింహా రెడ్డి లో హీరో గా నటిస్తున్నాడు. శృతి హాసన్మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  వరలక్ష్మీ శరత్ కుమార్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా , ఎస్ ఎస్ తమన్మూవీ కి  సంగీతం అందిస్తున్నాడు.  

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని 2023 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. కాక పోతే వీర సింహా రెడ్డి మూవీ ని ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం మూవీ యూనిట్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. బాలయ్య మాస్ యంధిమ్ ను తాజాగా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉంది. అలాగే ఈ సాంగ్ లో బాలకృష్ణ లుక్స్ , డ్రెస్సింగ్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: