నందమూరి బాలకృష్ణ ,డైరెక్టర్ గోపీచంద్ మలినేనీ దర్శకత్వం లో వస్తున్న చిత్రం వీరసింహారెడ్డి.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమా  విడుదల సందర్భంగా ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమా కు సంబంధించి ఫస్ట్  లుక్ టీజర్, టైటిల్ టీజర్ ఇతర ప్రత్యేకమైన పోస్టర్లకు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలోనే తాజాగా ఫస్ట్ సింగిల్ జై బాలయ్య సాంగ్ ని చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది.

ఈ లిరికల్ వీడియో సాంగ్ లో బాలకృష్ణ రాజసం ఉట్టిపడేలా కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హీరో పాత్రని ఎలివేట్ చేస్తూ సాగే ఈ పాట బాలయ్యను మరొక లెవల్లో తీసుకువెళుతుందని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. మాస్ లీడర్ గా వైట్ అండ్ వైట్లో బాలయ్య మరొకసారి అభిమానులను ఆకట్టుకుంటున్నారు.  ముఖ్యంగా ఈ పాటకు సంగీతాన్ని అందించిన తమన్ కూడా ఈ లిరికల్ వీడియోలో బాగానే ఆకట్టుకున్నారు.  ముఖ్యంగా ఈ పాట ఒసేయ్ రాములమ్మ టైటిల్ పాటను గుర్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ పాటకు శంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అందించారు. జనాల మధ్య దేవాలయాల పరిసరాలలో ఈ పాటను చిత్రీకరించినట్లుగా కనిపిస్తోంది. ఇందులో కన్నడ నటుడు విజయ్ దునియా విలన్ గా నటిస్తూ ఉన్నారు.  అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా బాలకృష్ణ చెల్లెలి పాత్రలో నటిస్తోంది.  అలాగే టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర , రాజీవ్ కనకాల కూడా కీలకమైన పాత్రలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి స్పెషల్గా విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.




మరింత సమాచారం తెలుసుకోండి: