అనారోగ్యంతో బాధపడుతు హాస్పిటల్ నుంచే ప్రమోషన్ చేసిన దానికి ఫలితంగా యశోద రూపంలో సమంతాకు మంచి ఫలితమే దక్కింది. ఇక టాక్ కొంచెం మిక్స్డ్ గా వినిపించినప్పటికీ ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద లాభాలతో బయట పడుతోంది.అయితే అపోజిషన్ లేకపోవడాన్ని బాగా ఎంజాయ్ చేసిన యశోద ఇంకో వారం పైనే సేఫ్ రన్ కొనసాగించేలా ఉంది. ఇక ఇది ఓకే కానీ ఇంతకీ సామ్ పూర్తిగా ఎప్పుడు కోలుకుంటుందో అంతు చిక్కడం లేదు. త్వరలోనే అనే మాట వినిపిస్తోంది కానీ అది డిసెంబరా లేక వచ్చే ఏడాదా అనేది తేలడం లేదు.

కాగా  డాక్టర్లు చెప్పేదాన్ని బట్టే తుది నిర్ణయం ఉంటుంది.అయితే సామ్ కోసం వంద కోట్ల పెట్టుబడులు మోక్షం పొందడానికి ఎదురు చూస్తున్నాయి. ఇక అందులో మొదటిది ఖుషి.ఇకపోతే  ఇంకో ముప్పై రోజులు షూటింగ్ చేస్తే అయిపోతుందనగా సమంతా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. దీంతో యూనిట్ అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉంది.ఇక  హీరో విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టు కమిటవ్వకుండా ఖుషి ఫినిష్ చేయడం కోసమే ఎదురు చూస్తున్నాడు. అయితే  అంతా సవ్యంగా జరిగితే 2023 వేసవిలో రిలీజ్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ఎంతలేదన్నా ఖుషి మీద థియేట్రికల్ బిజినెస్ నలభై కోట్ల దాకా జరగొచ్చు.  ఇక మల్టీ లాంగ్వేజ్ కాబట్టి అదేమంత కష్టం కాదు.ఇకపోతే గుణశేఖర్ శాకుంతలంలో సామ్ భాగం ఎప్పుడో అయిపోయింది కానీ ఆమె వస్తే తప్ప పబ్లిసిటీ మొదలుపెట్టలేరు.ఇక  యశోద లాగా ఒక వీడియో ఇంటర్వ్యూతో అయిపోయే వ్యవహారం కాదిది. మార్కెట్ ని మించి బడ్జెట్ ఖర్చు పెట్టారు. సో క్రేజ్ రావాలంటే సమంతా బయట కనిపించాలి. అయితే దీనికి అన్ని బాషలకు కలిపి అరవై కోట్లకు పైగానే టార్గెట్ పెట్టుకుంది గుణ టీమ్.కాగా  ఓ రెండు మూడు పోస్టర్లు తప్ప శాకుంతలంకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు.ఇక  కొత్తగా మొదలుపెట్టాల్సిన ప్రాజెక్టుల సంగతి తర్వాత చూసుకోవచ్చు కానీ ముందైతే ఈ రెండు సినిమాలకు రూట్ క్లియర్ అయితే అంతకంటే ఫ్యాన్స్ కి కావాల్సింది ఏముంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: