టాలీవుడ్  టాప్  హీరో సూపర్  స్టార్  మహేష్ బాబు తీవ్ర దుఃఖంలో ఉన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ ఏడాది ఆయనకి ఎంతో ఇష్టమైన మహేష్  కుటుంబసభ్యులు అందరు వరుసగా చనిపోయారు.ఒకరి తర్వాత ఒకరు మహేష్  బాబును విడిచి పెట్టిపోవడంతో ఆయన చాలా మనోవేదనకు గురవుతున్నారట. పైకి అందరిని చిరునవ్వుతో పలకరిస్తూ దైర్యం చెప్తున్నప్పటికీ మహేష్  లోలోపల  చాలా బాధపడుతూ.. ఒంటరిగా ఉన్న సమయంలో కన్నీరు మున్నీరవుతున్నారని సమాచారం తెలుస్తోంది. వరుసగా అన్న, అమ్మ ఇంకా అలాగే నాన్నను కోల్పోయారు మహేష్. ఈ ముగ్గురంటే మహేష్ బాబుకు ప్రాణం. చాలా సందర్భాల్లో వీరి గురించి ఆయన ఎంతో గొప్పగా చెప్పారు. ఇప్పుడు ఆ ముగ్గురు కూడా దూరం కావడంతో మహేష్  బాబు కొండత భాదను మోస్తున్నారు. మహేష్ బాబుకి  దైర్యం చెప్పడం కుటుంబసభ్యుల వల్ల కూడా కావడం లేదని ఆయన సన్నిహితుల దగ్గరనుంచి సమాచారం సమాచారం తెలుస్తుంది.


అయితే మహేష్  బాబు  ఇలాంటి పరిస్థితిల్లో ఒంటరిగా ఉండటం కంటే సెట్ లో ఉండటమే చాలా మంచిదని ఆయన కుటుంబసభ్యులు కూడా భావిస్తున్నారట. ఈ క్రమంలోనే త్రివిక్రమ్  శ్రీనివాస్  తో చేస్తున్న సినిమా షూటింగ్ కు హాజరవ్వాలని మహేష్ భావిస్తున్నారట.ఇక సూపర్  స్టార్  మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలోనే మహేష్ అన్న రమేష్ బాబు గారు, తల్లి ఇందిరాదేవి గారు, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు అనారోగ్యంతో ఒకరితర్వాత ఒకరు చనిపోయారు. దాంతో ఈ మూవీకి బిగ్  బ్రేక్ పడింది. అయితే ఇక ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ను స్టార్ట్  చెయ్యాలని భావిస్తున్నారట మహేష్.ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ముందే అనౌన్స్ చేశారు. అనుకున్న సమయానికి విడుదలయ్యేలా షూటింగ్ ను చాలా ఫాస్ట్ గా జరపనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే మహేష్ సెట్స్ లోకి అడుగుపెడతారని సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: