మహేష్ బాబు పుట్టేడు దుఃఖంలో వున్నాడు..మొన్న తల్లి, నిన్న నాన్న,గతంలో అన్న వీరి ముగ్గురి మరణం ఒక ఏడాదిలో జరగడం పై ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు.. ఒకరి తర్వాత ఒకరు మహేష్ ను విడిచి పెట్టిపోవడంతో ఆయన ఎంతో మనోవేదనకు గురవుతున్నారట. పైకి అందరిని చిరునవ్వు తో పలకరిస్తూ దైర్యం చెప్తున్నప్పటికీ లోలోపల బాధపడుతూ.. ఒంటరిగా ఉన్న సమయంలో కన్నీరు మున్నీరవుతున్నారని తెలుస్తోంది. వరుసగా అన్న, అమ్మ. నాన్నను కోల్పోయారు మహేష్. ఈ ముగ్గురంటే మహేష్ కు ప్రాణం. చాలా సందర్భాల్లో వీరి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఇప్పుడు ఆ ముగ్గురు దూరంకావడంతో మహేష్ కొండత భాదను మోస్తున్నారు..


మహేష్ కూడా దైర్యం చెప్పడం కుటుంబసభ్యుల వల్ల కావడం లేదని ఆయన సన్నిహితుల దగ్గరనుంచి సమాచారం అందుతుంది. అయితే, మహేష్ ఈ సమయంలో ఒంటరిగా ఉండటం కంటే సెట్ లో ఉండటమే మంచిదని కుటుంబసభ్యులు కూడా భావిస్తున్నారట. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ షూటింగ్ కు హాజరవ్వాలని భావిస్తున్నారట. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలోనే మహేష్ అన్న రమేష్ బాబు, తల్లి ఇందిరాదేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో ఒకరితర్వాత ఒకరు కన్నుమూశారు.


ఇక  ఈ సినిమాకు బ్రేక్ పడింది. అయితే ఇక ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ను మొదలు పెట్టాలని భావిస్తున్నారట మహేష్..త్వరగా షూటింగ్ ను పూర్తీ చేసి.వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ముందే అనౌన్స్ చేశారు మేకర్స్. అనుకున్న సమయానికి విడుదలయ్యేలా షూటింగ్ ను శరవేగంగా జరపనున్నారని తెలుస్తోంది. త్వరలోనే మహేష్ సెట్స్ లోకి అడుగుపెడతారని తెలుస్తోంది. ఈ లో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ ను తెరకెక్కించనున్నారు త్రివిక్రమ్.మరీ సినిమా ఎలా వుంటుందో చూడాలి మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: