నటసింహ బాలకృష్ణ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ఆరు పదులు వయసులో కూడా ఒకవైపు రాజకీయాలు.. మరొకవైపు సినిమాలు.. సింగిల్ హ్యాండ్ తో బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాదు స్టార్ హీరోలు సైతం ఈయన దూకుడు చూసి వెనుకడుగు వేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. మరొకవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలకు హోస్టుగా వ్యవహరిస్తూ పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా రెండు చేతులా.. బాగా సంపాదిస్తున్న బాలయ్య సినిమాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటారన్న విషయం తెలిసిందే. ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాను తెరకెక్కించి భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


అయితే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో రెండవ భాగం ఎప్పుడు మొదలవుతుంది అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు కానీ ఈ సినిమాపై ఎవరు స్పష్టత ఇవ్వలేదు తాజాగా బాలయ్య బాబే ఈ సినిమా గురించి స్పష్టత ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇటీవల జరిగిన గోవా ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ పై స్పందిస్తూనే మరొకవైపు అఖండ -2 గురించి కూడా వెల్లడించారు.. అఖండ -2 స్క్రిప్ట్ మొత్తం సిద్ధం  అయిందని .. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను విడుదల చేస్తామని బాలకృష్ణ స్పష్టం చేశారు. అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న  బాలకృష్ణ ఇప్పుడు అఖండ 2 తో పాన్ ఇండియా హీరోగా మారనున్నట్లు సమాచారం.


ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి నెలలో విడుదల కాబోతోంది . ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని రూపొందించిన తర్వాత అఖండ 2 సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని బాలకృష్ణ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: