నిన్నటి రోజున విభిన్నమైనటువంటి చిత్రాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ఇక ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో సినిమా రాబోతోందని ఎప్పటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి నిన్నటి రోజున ఎట్టకేలకు.. ముహూర్తాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఒకేసారి తెలుగు ,తమిళ్ , హిందీ వంటి భాషలలో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. రాయన్ దాస్ కే నారంగ్ ఆశీస్సులతో ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
అయితే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. నిన్నటి రోజున ఈ చిత్ర పూజ కార్యక్రమాలు చాలా గ్రాండ్గా ప్లాన్ చేసారు. ఈ సినిమా కోసం వివిధ భాషల్లోని నటీనటులను తీసుకోబోతున్నట్లు సమాచారం. దీంతో తమిళ దర్శకులు ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాని ఎంచుకున్నందుకు విమర్శలు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా తమిళ్ నటుడు అయ్యుండి తెలుగు దర్శకులతో వరుసగా సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తమిళ దర్శకులకు అవకాశాలు ఇవ్వడం లేదని దర్శకుడు పేరారసు విమర్శించడం జరిగింది. మరి ఈ విమర్శకులపై ధనుష్ ఎలా స్పందిస్తారో చూడాలి.