సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రస్తుతం ఒక మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా తెరకెక్కుతోంది. పూజ హెగ్డేమూవీ లో మెయిన్ హీరోయిన్ గా నటించనుండగా , శ్రీ లీల ఈ మూవీ లో రెండవ హీరోయిన్ గ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. అలాగే మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది.

మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ రెండవ షెడ్యూల్ షూటింగ్ లో పూజ హెగ్డే కూడా జాయిన్ కానున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో దర్శకుడు త్రివిక్రమ్ ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ ను సెట్ చేసినట్లు , అందులో భాగంగా ఈ ఐటమ్ సాంగ్ కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న రష్మిక మందన ను ఈ మూవీ యూనిట్ సంప్రదించినట్లు ,  రష్మిక మందన కూడా ఈ మూవీ లోని ఐటమ్ సాంగ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది.

రష్మిక మందన కనక ఈ మూవీ లోని ఐటమ్ సాంగ్ లో నటించినట్లు అయితే ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన , దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న వరసు అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: